Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర కానుకగా భగీరథ నీళ్లు ఇస్తా మని ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్ ఇన్ చీఫ్ బి.సురేందర్రెడ్డి అన్నారు. ఈమే రకు సీఎం కోరికను నెరవేర్చేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నామని గుర్తు చేశారు. ఈనెలాఖరు వరకు పనులు పూర్తయిన సెగ్మెంట్లలో వెంటనే మంచినీటి సరాఫరా ప్రారంభించాలని అన్ని జిల్లాల ఎస్.ఈ, ఈఈలకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం హైదరాబాద్ ఆర్డబ్ల్యూఎస్ రాష్ట్ర కార్యాలయంలో జిల్లా ఎస్.ఈ, ఈఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే మూడు నెలలు భగీరథ ఇంజినీర్లకు పరీక్షా సమయం అని సురేందర్రెడ్డి చెప్పారు. రూ.100 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో పాత కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో చేపట్టిన ఇంట్రా విలేజ్ పనులను ఈ నెల చివరి నాటికి పూర్తి చేయాలని చెప్పారు.
తద్వారా 70 వేల ఇండ్లకు నల్లాల ద్వారా రక్షిత మంచినీటిని అందించాలని సూచించారు. ఇంటెక్ వెల్స్తోపాటు ఎలక్ట్రో మెకానికల్ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. పంపు సెట్ల ను త్వరగా తెప్పించుకోవాలని ఆదేశించారు. వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్, పైప్ లైన్ పనుల వివరాలు తెలుసుకున్న ఈ.ఎన్.సి, వర్క్ ఏజెన్సీలతో సమన్వయం ఏర్పరుచుకుని అనుకున్న సమయంలో లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పారు. డక్ట్ పురోగతితో పాటు ఎంపీ ల్యాండ్ నిధులతో చేపట్టిన పనులను ఆయా జిల్లాల ఎస్.ఈలు ఇంజినీర్ ఇన్ చీఫ్కు వివరించారు. ఇంట్రా విలేజ్ పనుల చెల్లింపుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న నిజామాబాద్ డీఈపై శాఖాపరమైన విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత చీఫ్ ఇంజనీర్ జగన్మోహన్రెడ్డిని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో చీఫ్ ఇంజినీర్లు క పాకర్ రెడ్డి, విజయపాల్ రెడ్డి, విజరు ప్రకాశ్తో పాటు సలహాదారు జానేశ్వర్, ఇతర కన్సల్టెంట్లు అధికారులు పాల్గొన్నారు.