Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సింగరేణి గుర్తింపు ఎన్నికల నేపథ్యంలో అక్కడి కార్మికులను యాజమాన్యం ప్రలోభాలకు గురి చేస్తున్నదని ఏఐటీయూసీ విమర్శించింది. ఈ ఎన్నికల్లో తిరిగి విజయం సాధించేందుకు వీలుగా అధికార టీఆర్ఎస్, సింగరేణి యాజమాన్యం కలిసి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి ఉజ్జిని రత్నాకర్రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు.