Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం టంగుటూరు గ్రామ పరిధిలోని గౌతమి ఎక్స్క్లూస్ కంపెనీ ల్యాబ్లో ఆదివారం సాయంత్రం రియాక్టర్ పేలి ఓ కార్మికుడు మృతి చెందాడు. మరో కార్మికునికి తీవ్ర గాయాలయ్యాయి. సీఐ ఆంజనేయులు వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట మండలం చిన్న కందూరు గ్రామానికి చెందిన ర్యాకల సిద్ధులు (45) ఎలక్ట్రిషన్గా పని చేస్తూ జీవిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఆ కంపెనీలో పని మానేశాడు. ఈ నేపథ్యంలో కంపెనీలో పని ఉందని ఆదివారం సాయంత్రం సిబ్బంది సిద్ధులును తీసుకెళ్లారు. పనిచేస్తుండగా రియాక్టర్ పేలి తీవ్ర గాయాలపాలయ్యాడు. అతని వెంట ఉన్న ఒరిస్సాకు చెందిన మరో కార్మికుడికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇరువురిని సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సిద్ధులు మృతిచెందాడు. మరో కార్మికుడు చికిత్స పొందుతున్నాడు.