Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కిటకిటలాడుతున్న రైల్వే స్టేషన్లు
- చోటు కోసం ఎగబడుతున్న జనరల్ టిక్కెట్ ప్రయాణికులు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దసరా పండుగకు స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్లోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లతో పాటు కాజీపేట, నిజామాబాద్, మహబూబ్నగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నల్లగొండ తదితర రైల్వే స్టేషన్లు ఉదయం నుంచే ప్రయాణీకులతో కిక్కిరిసిపో యాయి. ఆయా స్టేషన్ల నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు ప్లాట్ఫామ్లపై బారులు తీరారు. జనరల్ బోగీల్లో కూర్చునేందుకు సీట్లు దక్కించుకోవడం కోసం యువకులు, నడివయస్సు కలిగిన పురుషులు రైలు ప్లాట్ఫామ్కు రాకముందే దూరంగా నిలబడి మెళ్లిగా ప్లాట్పామ్పైకి వస్తున్న రైళ్లెక్కి సీటు దక్కించుకుంటున్నారు. యువకులు సీట్ల కోసం ఎగబడుతుండటంతో మహిళలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బోగీల్లో కనీసం నిలబడేం దుకు సైతం ఖాళీ లేకపోవడంతో గత్యంతరంలేక సెకెండ్ క్లాస్ రిజర్వేషన్ బోగీల్లో ఎక్కి కూర్చుం టున్నారు. రిజర్వేషన్ సీట్లలో జనరల్ టిక్కెట్ ప్రయాణికులు కూర్చొవడంతో గొడవలు జరుగుతు నానయి. విషయం తెలుసుకుని టీసీలు రిజర్వేషన్ బోగీలకు చేరుకుని నాన్ రిజర్వేషన్ ప్రయాణికులను వచ్చే స్టేషన్లో దిగి జనరల్ బోగీల్లో కూర్చోవాల్సిం దిగా ఆదేశిస్తున్నారు. లేదంటే పెనాల్టీ కట్టాల్సిందిగా ఆదేశిస్తున్నారు. ఇదిలావుండగా దసరా రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కొన్ని మార్గాల్లో అదన పు రైళ్లను నడుపుతున్నప్పటికీ అవి ప్రయాణికులకు ఏ మాత్రం సరిపోవడంలుదు. దసరా పండుగ సమీ పిస్తుండటంతో ప్రయాణికుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున ద.మ రైల్వే అధికారులు కొన్ని రూట్లలో ప్రత్యేక రైళ్లు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరికొన్ని రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేసే అలోచన ఉన్నట్టు అధికారులు తెలిపారు. పండుగ సీజన్ కాబట్టి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా నిత్యం రెగ్యూలర్ రూట్లల్లో తిరిగే రైళ్లకు కూడా అదనపు బోగీలు ఏర్పాటు చేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు.