Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 19 మందితో నూతన కమిటీ ఎన్నిక
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) వృత్తివిద్యార్థుల జాతీయ కన్వీనర్గా మయూక్బిశ్వాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం నుంచి హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఎస్ఎఫ్ఐ వృత్తివిద్యార్థుల జాతీయ సమ్మేళనం ఆదివారం విజయవంతంగా ముగిసింది. ఎస్ఎఫ్ఐ వృత్తివిద్యార్థుల జాతీయ కమిటీ 19 మందితో ఎన్నుకున్నారు. కో కన్వీనర్లుగా లక్ష్మణ్, శ్రీనాథ్, అరుణజిత్సాహా, సభ్యులుగా బానుషా, లాల్సలాం, ప్రసన్న, అఖిల్షా, గురురాజ్, కల్పన, వికాస్, జీవన్తోపాటు మరో ఏడుగురున్నారు.