Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంపై గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హర్షం వ్యక్తంచేశారు. రైతులకు మేలు జరగడంతో పాటు ప్రభుత్వానికి భూములకు సంబంధించి సమగ్ర సమాచారం తెలుస్తుందని అన్నా రు. ప్రజలతో మమేకమై రెవెన్యూ అధికారులు గొప్ప బాధ్యతతో కూడిన పని చేస్తు న్నారని అభినందించారు. రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని సోమవారం గవర్నర్ పాలమూరు, మెదక్ జిల్లాల్లో స్వయంగా పరిశీలించనున్నారు. శుక్రవారం సీఎం కేసీఆర్ గవర్నర్ను కలిసి భూ రికార్డుల ప్రక్షాళన తీరుతెన్నులను వివరించిన నేప థ్యంలో.. దానిపై ఆశక్తి కనబర్చిన గవర్నర్ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా, ల్యాండ్ ప్యూరిఫికేషన్ మిషన్ స్పెషల్ ఆఫీసర్ వాకాటి కరుణలను ఆదివా రం రాజ్భవన్కు పిలిపించుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు.