Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాసనమండలి చీఫ్విప్ పాతూరి సుధాకర్రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, లెక్చరర్ల సర్వీసుల క్రమబద్ధీ కరణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని శాసనమండలి చీఫ్విప్ పాతూరి సుధాకర్రెడ్డి చెప్పారు. కాంట్రాక్టు లెక్చరర్లకు అండగా ఉంటామని అన్నారు. ఆదివారం హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం రాష్ట్రకౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సుధాకర్రెడ్డి మాట్లా డుతూ న్యాయస్థానాల్లో జీవో నెంబర్ 16ను కాపాడేందుకు అన్ని విధాలా ప్రభు త్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. కాంట్రాక్టు లెక్చరర్లు ప్రభుత్వ కాలేజీల అభివృద్ధికి పాటుపడాలని కోరారు. కాంట్రాక్టు లెక్చరర్లకు 12 నెలల వేతనం, ఇతర సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు నాగటి నారాయణ మాట్లాడుతూ ఉన్నత విద్యారంగాన్ని కాపాడాలని చెప్పారు. ప్రభుత్వ కాలేజీల్లో చదివే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని కోరారు. హైకోర్టు న్యాయవాది జివిఎల్ మూర్తి మాట్లాడుతూ జీవో నెంబర్ 16ను న్యాయపరంగా కాపాడేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఈ కార్యక్ర మంలో కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు జి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్, కోశాధికారి నాయిని శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ వి శ్రీనివాసు, అసోసియేట్ ప్రెసిడెంట్ శోభన్బాబు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రకౌన్సిల్ తీర్మానాలు
- వేతనాలు పెంచడం పట్ల, జూనియర్ కాలేజీల్లో 1100 పోస్టులు మంజూరు చేయడం పట్ల సీఎం కేసీఆర్,ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి కృతజ్ఞతలు.
- జీవో నెంబర్ 16 న్యాయస్థానాల్లో గెలిచేటట్టు ప్రభుత్వం చొరవ చూపాలి
- క్రమబద్ధీకరణ జరిగే వరకు కాంట్రాక్టు లెక్చరర్లకు 12 నెలల జీతం, డీఏ, హెచ్ఆర్ఏ ఇవ్వాలి
- పభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలి
- పభుత్వ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లందరినీ ఎలాంటి షరతుల్లేకుండా - మబద్ధీకరించాలి
- కాంట్రాక్టు లెక్చరర్లకు బదిలీలు చేపట్టాలి. చనిపోయిన కాంట్రాక్టు లెక్చరర్ల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలి