Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరు నెలల్లో సమగ్ర పర్యావరణ నివేదిక
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూరి ్తస్థాయి పర్యావరణ ప్రభావ నివేదిక తయారీకి కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన పర్యావరణ సలహా సంఘం సమావేశంలో ఈ ప్రాజెక్టు ప్రతిపాద నలు పరిశీలించి విధివిధానాలను జారీ చేయడానికి అంగీకరించినట్టు అధికారులు చెబుతున్నారు.
మొత్తం మూడు సీజన్లలోనూ పర్యావరణ ప్రభావాన్ని అంచ నా వేసి తొమ్మిది నెలల్లోపు సమగ్ర నివేదిక తయా రుచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలను ప్రారంభిం చింది. నార్లాపూర్ నుంచి ఉద్ధండాపూర్ వరకు తాగు నీటి అవసరాలు తీర్చేందుకు మాత్రమే ఈ ప్రాజెక్టు పనులు కొనసాగిస్తున్నట్టు, తాగునీటి పనుల కోసం పర్యావరణ అనుమతులు అవసరం లేదని, సాగునీటి పనులను మాత్రం పర్యావరణ, అటవీ అనుమతులు వచ్చిన తర్వాతే ప్రారంభిస్తారు. ఎత్తిపోతల పథకానికి మొదటి దశ పర్యావరణ అనుమతి మంజూరు చేయడం పట్ల సాగునీటి శాఖ మంత్రి హరీశ్ రావు హర్షం ప్రకటించారు.