Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విద్యార్థుల ఫీజులు చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. ఆదివారం బీసీ భవన్లో బీసీ విద్యార్థుల సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడం అన్యాయమన్నారు. ఫీజులు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఫీజు బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.