Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధితున్ని బెదిరించి పరార్
- గ్రామస్తుల రాస్తారోకో
నవతెలంగాణ-రేగొండ
స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి తనయుడు సిరికొండ ప్రశాంత్ కాన్వారు ఢకొీని 13 గొర్రెలు మృతి చెందాయి. ఓ మహిళ కాలు విరిగిపోయింది. ఈ ఘటన జయశంకర్ జిల్లా రేగొండ మండలం రూపిరెడ్డిపల్లిలోని రామాలయం సమీపంలో ఆదివారం జరిగింది. మేం స్పీకర్ మనుషులం అంటూ బాధితులను బెదిరించి వాహనాలను తీసుకుని వెళ్లిపోయారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతిచెందిన గొర్రెలతో గ్రామస్తులు రాస్తారోకో చేశారు. దీంతో భూపాలపల్లి-పరకాల రహదారిపై ఐదు కిలోమీటర్లమేర వాహనాలు నిలిచిపోయాయి. బాధితుని వివరాల ప్రకారం.... చెన్నాపూర్ గ్రామానికి చెందిన ఒన్నాల మల్లయ్య తనకు చెందిన గొర్రెలను గంగరాయి చెరువు సమీపంలో మేపుకొని ఇంటికి తోలుకొస్తున్నాడు. ఈ క్రమంలో రామాలయం వద్ద రోడ్డు అవతలికి గొర్రెలను దాటిస్తుండగా భూపాలపల్లి నుంచి పరకాలకు వెళ్తున్న సిరికొండ ప్రశాంత్ కాన్వాయి అతి వేగంతో దూసుకొచ్చి ఢ కొట్టింది. 13 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న రూపిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన శవ్వాల లక్ష్మిని కాన్వాయి ఢకొీట్టడంతో కాలు విరిగి నడుముకు బలమైన గాయాలు కాగా 108 వాహనం ద్వారా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
స్పీకర్ మనుషులమంటూ బాధితులకు బెదిరింపు
కాన్వాయితో ఢకొీట్టి 13 గొర్రెల మృతికి కారణమైన కారకులు స్పీకర్ అనుచరులమంటూ బాధితున్ని బెదిరించి ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయారు. అనంతరం బాధితుడు, మరికొంత మంది గ్రామస్తులు మృతి చెందిన మేకలతో రోడ్డుపై రాస్తారోకో నిర్వహించడంతో భూపాలపల్లి- పరకాల ప్రధాన రహదారిపై ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు గంటసేపు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న చిట్యాల సీఐ గండ్రతి మోహన్ ఘటనా స్థలానికి చేరుకొని బాధితునితో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమింపజేశారు.