Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
హిందుత్వ ఫాసిస్టు శక్తులను విశాలమైన ఐక్య పోరాటాల ద్వారా నిలువరించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్లోని బాబ్రీమసీదు కూల్చివేత నుంచి హిందూత్వ శక్తుల ఆగడాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. కల్బుర్గి, జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య వరకూ యధేచ్ఛగా సంచరిస్తున్నాయని వెల్లడించారు. ఇప్పుడు తాజాగా రచయిత కంచ ఐలయ్యపై ఆ శక్తులు దాడికి దిగుతున్నాయని ఆరోపించారు. జర్నలిస్ట్ గౌరీలంకేశ్ హత్య, రచయిత కంచ ఐలయ్యపై దాడికి నిరసనగా విప్లవ రచయితల సంఘం మంగళవారం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించింది. ఇందులో జర్నలిస్టులు, కవులు, రచయితలు పాల్గొని హిందూ మతోన్మాదుల దాడిని ఖండించారు. విరసం నగర కన్వీనర్ గీతాంజలి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వరవరరావు, కొండెపూడీ నిర్మల, కె శివారెడ్డి, అమ్మంగి వేణుగోపాల్, డానీ, కాశీం, దేవకిదేవి, యాకూబ్, కాకరాల, రాపోలు సుదర్శన్, పగడాల నాగేందర్, ఎకె ప్రభాకర్, ఆలూరి కవిని, మంజుల, డివి రామకృష్ణారావు, కూర్మనాథ్, రామచంద్రం, బిఎన్.రాజు, అరవింద్, నవతెలంగాణ దినపత్రిక ఎడిటర్ ఎస్.వీరయ్య మాట్లాడారు. భిన్నాభిప్రాయాలను సహించలేని ఆర్ఎస్ఎస్ శక్తులు గౌరీ లంకేశ్ను జ్ఞానంతో ఎదుర్కోలేక ఆయుధంతో చంపేశాయని వక్తలందరూ అభిప్రాయపడ్డారు. భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుకునే విశాల ఐక్య సంఘటన ఏర్పడాలనే ఆకాంక్ష వ్యక్తం చేశారు. కంచ ఐలయ్య నిచ్చెన మెట్ల కుల సమాజంలో ఉత్పత్తి కులాల నుంచి ఎదిగివచ్చిన రచయిత అని వక్తలు తెలిపారు. ఐలయ్య రచనల్లో ఓ ప్రత్యేకమైన వ్యక్తీకరణ ఉంటుందని, ఆ వ్యక్తీకరణ పట్ల, సంవిధానం పట్ల ఎవరికైనా భిన్నాభిప్రాయాలుంటే చర్చకు పెట్టాలని, అలా గాకుండా భౌతిక దాడులకు దిగడం, చంపుతామని బెదిరించడం సరైందికా దన్నారు. ఐలయ్య మీద జరుగుతున్న ఈ దాడులను రెండు తెలుగు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. వరవరరావు మాట్లాడుతూ హిందూ బ్రాహ్మణీయ శక్తుల కారణంగా దేశంలో దళిత, మైనార్టీలకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. నాటి బాబ్రీ మసీదు కూల్చివేత నుంచి హిందూ ఫాసిస్టు శక్తులు పేట్రేగిపోయా యన్నారు. ఆనాడు కల్బుర్గీ, పన్నారే, ఈనాడు గౌరి లంకేశ్ను హత్య చేసిన వారు ఒక్కరే అని చెప్పినా.. హంతకులను ఇప్పటివరకూ పట్టుకోలేక పోయారని ఆరోపించారు. 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' పుస్తకం రాసిన ందుకు రచయిత కంచ ఐలయ్యపై ఆర్యవైశ్యులు సిగ్గుమాలిన దాడికి దిగారని విమర్శించారు. కవి, రచయిత శివారెడ్డి మాట్లాడుతూ భావ స్వేచ్ఛపై హిందుత్వ శక్తులు దాడికి తెగబడుతున్నాయని ఆరోపించారు. రచయితలపై దాడులు చేయడాన్ని ఆయన ఖండించారు.