Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వానికి హైకోర్టు సూచన
నవతెలంగాణ- హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర వైద్య చట్టాల్ని కఠినతరం చేయాలని ఉమ్మడి హైకోర్టు సూచించింది. నకిలీ ఆస్పత్రులు ఏర్పాటు చేసే వారికి చట్టంలో జరిమానా విధించే వీలు మాత్రమే ఉందని, కఠిన శిక్షలు విధించేలా చట్టం ఉండాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచన చేసింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగెనెస్సీ యాక్ట్-1971, అల్లోపతి మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్స్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులరైజేషన్) యాక్ట్-2002లను ప్రకారం తప్పు చేసిన వారికి జరిమానాల విధింపులకు మాత్రమే వీలుకల్పిస్తున్నాయని హైకోర్టు న్యాయమూర్తి చల్లా కోదండరామ్ తన తీర్పులో ఉదహరించారు. రత్తావత్ దేవి అనే మహిళకు అబార్షన్ చేశారని తప్పుపడుతూ అధికారులు ఆ రెండు చట్టాల కింద వనపర్తి జిల్లా, పెబ్బేరులోని శ్రీకష్ణ నర్సింగ్ హౌంను సీజ్ చేయడాన్ని ఆయన కొట్టివేశారు. ఆస్పత్రిని సీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ డాక్టర్ అరవింద్ సాగర్ దాఖలు చేసిన కేసులో న్యాయమూర్తి కీలక సూచనలు ప్రభుత్వానికి చేశారు. ఆస్పత్రుల తనిఖీ బందంలో కూడా నిపుణులు ఉండేలా చట్టాలు ఉండాలన్నారు. ఆస్పత్రి అనుమతికి రిజిస్ట్రేషన్ విధిగా ఉండాలని, అనుమతి రెన్యువల్ కూడా తప్పకుండా చేసుకోవాలని, ఇవి లేనప్పుడు ఆస్పత్రుల్ని నిర్వహించడం చట్ట వ్యతిరేకమే అవుతుందని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.