Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తన రచనల వెనుక క్రిస్టియన్ ఎజెండా ఉందంటూ ఆర్యవైశ్య తరగతులు అకారణంగా తన మీద ఆరోపణలు చేస్తున్నారని కంచ ఐలయ్య అన్నారు. తనకు క్రిస్టియన్లు, వారి విద్యాసంస్థలతో సంబంధాలు ఉన్నాయని, తన రచనల వెనుక క్రిస్టియన్ ఎజెండా ఉందనడం సరికాదని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు క్రిస్టియన్ విద్యాసంస్థలు ఆంగ్ల విద్యను బోధిస్తాయని చెప్పారు. అతితక్కువ ఖర్చుతో విద్యను అందించడం వాటి ప్రత్యేకత అని వివరించారు. తనకు గుడ్షెపర్డ్ సొసైటీతో రచనలకు సంబంధించిన అనుబంధం మాత్రమే ఉందన్నారు. ఈ పాఠశాల పేద విద్యార్థులకు ఆంగ్ల విద్యను అందించేదని గుర్తు చేశారు. ఆర్యవైశ్యుల పిల్లలు పట్టణాల్లోని క్రిస్టియన్ మిషన్ స్కూళ్లల్లో చదవడం లేదా ? అని ప్రశ్నించారు. ఆర్యవైశ్యులకు తనను తప్పుబట్టే హక్కు ఎంతమాత్రం లేదన్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన జారీ చేశారు.