Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నవంబర్లో హైదరాబాద్ నగరంలో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు జరగనున్నట్టు రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడిస్తూ.. నవంబర్ 28వ తేదీన మధ్యాహ్నం ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు నగరంలో ప్రారంభం అవుతుందన్నారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంక చేతుల మీదుల సదస్సు ప్రారంభం కానున్నట్టు చెప్పారు. నగరంలో ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ సదస్సుకు 12 వందల మంది ప్రతినిధులు హాజరుకానున్నట్టు వెల్లడించారు. సదస్సుకు హాజరయ్యే వారిలో 400 మంది భారతీయ ప్రతినిధులతో పాటు అమెరికా నుంచి 400 మంది, ఇతర దేశాల నుంచి మరో 400 మంది ప్రతినిధులు హాజరుకానున్నట్టు తెలిపారు. అదేవిధంగా మరో 300 మంది వ్యాపారవేత్తలు సదస్సులో పాల్గొననున్నట్టు చెప్పారు.
కేటీఆర్కు మరో ప్రతిషాత్మక ఆహ్వానం
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం అందింది. ఇండియా-యూఏఈ భాగస్వామ్య సదస్సుకు హాజరై ప్రసంగించాల్సిందిగా నిర్వాహాకులు మంత్రి కేటీఆర్కు ఆహ్వానం అందజేశారు. బిజినెస్ లీడర్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో ఇండియా-యూఏఈ భాగస్వామ్య సదస్సు ఈ నెల 30, 31 తేదీల్లో దుబారులో జరగనుంది. దుబారు, యూఏఈ దేశాలతో భారత వాణిజ్య సంబంధాల బలోపేతమే లక్ష్యంగా సమావేశం జరుగుతోంది. మంత్రి కేటీఆర్ 30న జరిగే మంత్రులస్థాయి సమావేశంలో పాల్గొననున్నారు.
తాజ్మహల్పై