Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధానికి జైపాల్రెడ్డి ప్రశ్న
- 'పెట్రో' ధరలతో ప్రజలపై 6 లక్షల కోట్ల భారం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
భారతదేశ సంస్కృతిలో అంతర్భాగమైన తాజ్మహల్ గురించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్, బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ప్రధాన నరేంద్రమోడీ మౌనంగా ఎందుకు ఉన్నారని కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్రెడ్డి ప్రశ్నించారు తాజ్మహల్పై మీ అభిప్రాయం ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తాజ్ మహల్ మన దేశంలో భాగం కాదంటారా? ప్రశ్నించారు. తాజ్మహల్పై మాట్లాడిన వ్యాఖ్యలు సంస్కతికి వ్యతిరేకమన్నారు. 'ప్రపంచంలో ప్రేమకు చిహ్నం. ఏడు వండర్స్లో ఒకటి. సంస్కతికి మతానికి, వారసత్వానికి, సంబంధమేమిటి' అని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం పత్రికల వాళ్ళను బెదిరిస్తుందన్నారు. ప్రజల మధ్య మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడపాలని బీజేపీ ఎప్పుడూ ప్రయత్నిస్తోందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు తగ్గినా ఎందుకు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడంలేదన్నారు. పెట్రోల్, డీజిల్లపై కేంద్ర ప్రభుత్వం పెద్దమొత్తంలో పన్నులు వేసి సామాన్యుల నడ్డి విరుస్తుందన్నారు. మోడీ మూడేండ్ల పాలనలోసామాన్యులపై ఆరు లక్షల కోట్ల భారం మోపిందన్నారు. జీడీపీ నష్టాలను పూడ్చుకునేందుకు పెట్రోల్, డీజిల్పై వచ్చే సుంకాన్ని వాడుకొంటున్నారని చెప్పారు. మోడీ నిర్ణయాలు సామాన్యుల పట్ల శాపంగా మారాయన్నారు. ఇంతగా ప్రజలను పీడించుకుతినే ప్రభుత్వం ఎన్నడూ రాలేదన్నారు.
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ముఖ్యమంత్రి టి అంజయ్య హయాంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పురుడు పోసుకుందన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు కోసం నాడు స్థానిక ఎమ్మెల్యేగా తాను పట్టుబట్టి సాధించుకున్నామని గుర్తు చేశారు. కల్వకుర్తి పథకం మేము సాధించిన ఘనతనే అని కొందరు మంత్రులు చెప్పడం హాస్యాస్పదమన్నారు. మంత్రులు జూపల్లి కృష్టారెడ్డి, లక్ష్మారెడ్డి ఆనాటి ప్రభుత్వాల్లో భాగస్వాములు కాదా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా మాటలు కట్టిపెట్టి ప్రాజెక్టును పూర్తి చేయాలని సూచించారు. బీజేపీ ప్రభుత్వమంటే కేసీఆర్కు భయం ఉందన్నారు. కేసీఆర్ చేస్తున్న తప్పులు ఈడీ, సీబీఐకి తెలుసన్నారు.రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి వస్తున్నారనే సమాచారం తమకు తెలియదని చెప్పారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీతో సంబంధం లేని ఏ పార్టైనా మాతో కలసి వచ్చినా మంచిదేనని జైపాల్రెడ్డి ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు.