Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పౌరహక్కుల సంఘం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో రాజ్యహింసను తీవ్ర చేయడానికి సర్కారు కుట్ర పన్నుతోందని తెలంగాణ పౌరహక్కుల సంఘం ఆరోపించింది. మావోయిస్టులతో సంబంధాలున్న పేరుతో విద్యార్థి, రైతాంగ నేతలను అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని వెల్లడించింది. వారికేమైనా అయితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లక్ష్మణ్, నారాయణరావు మంగళవారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్ర సర్కారు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నదని పేర్కొన్నారు. జేఏసీ చైర్మెన్ కోదండరామ్కు నక్సలైట్లతో సంబంధాలు న్నాయని ప్రచారం చేస్తున్నారన్నారు. విద్యార్థి, రైతాంగ సంస్థల్లో సభ్యులైన మహేశ్, పాండు, విజరు, సాయన్న, భరత్, ప్రవీణ్ను అరెస్ట్ చేసే ప్రయత్నాలు విరమించుకోవాలన్నారు. వారికి ఏమైన జరిగితే. ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు.