Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన రాజకీయ జేఏసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిజన జనాభా ప్రకారం గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని గిరిజన రాజకీయ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈసందర్భంగా గిరిజన ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వివేక్ వినా యక్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గిరిజనులకు నేరుగా 10శాతం రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలన్నారు. ఇతర కులాలను కలుపాలన్న ఆలోచనను విరమించుకోవాలని తెలిపారు. గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం ధర్మానాయక్ మాట్లాడుతూ ఇతర కులాలను గిరిజన జాబితాలో కలపడాన్ని ట్రైకార్ అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు. చెల్లప్ప కమిటీ నివేదికను కూడా గిరిజన సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఉన్న జనాభా ఆధారంగా 9శాతం రిజర్వేషన్లను అమలు చేయడానికి వెంటనే క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఎరుకల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకిని రాజు, టీఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శోభన్ నాయక్, విద్యార్థి సంఘం నాయకులు వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.