Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నది. ఈ ప్రాజెక్టులో ఇన్ఫ్లో 2,34,580 క్యూసెక్కులుగా ఉన్నది. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా మంగళవారం సాయంత్రానికి 558.50 అడుగులకు పెరిగింది. ఈ రిజర్వాయర్లో పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312 టీఎంసీలు కాగా 228.90 టీఎంసీలకు చేరింది. కృష్ణా పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులో కూడా వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఈ ప్రాజెక్టు నుంచి నుంచి 2,53,324 క్యూసెక్కులు కిందకి విడుదల చేస్తున్నారు. దీనిలో స్పిల్వే ద్వారా 1,65,620 క్యూసెక్కులు, ఎడమ, కుడి విద్యుత్ కేంద్రాల ద్వారా 72,500 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడుకు 12,000 క్యూసెక్కులు, కల్వకుర్తికి 1,600 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 1,688 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. జూరాలలో కూడా వరద ప్రవాహం కొనసాగు తున్నది. ఈ ప్రాజెక్టులో ఇన్ఫ్లో 1,85,000 క్యూసెక్కులు కాగా ఇక్కడి నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 1,96,000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.