Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- హైదరాబాద్
నయీముద్దీన్ అనుచరుడు శ్రీధర్గౌడ్ను పీడీ యాక్ట్ కింద తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడాన్ని హైకోర్టు సమర్ధించింది. సాధారణ చట్టాలను ఖాతరు చేయని శ్రీధర్గౌడ్ లాంటి వారిపై పీడీ యాక్ట్ అమలు చేయడం సబబేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నో అరాచకాలకు పాల్పడ్డాడన్న ఆరోపణల తర్వాత నయీం ఎన్కౌంటర్ అయిన తర్వాత కూడా శ్రీధర్గౌడ్ అరాచకాలు ఆగకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం పీడీ యాక్ట్ ప్రయోగించిన విషయం విదితమే. గ్యాంగ్స్టర్ నయీం కీలక అనుచరుడు శ్రీధర్గౌడ్పై పీడీ యాక్ట్ ఉపయోగిస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్ 2016లో జారీ చేసిన ఉత్తర్వులను ఈ ఏడాది జనవరి 5న తెలంగాణ సర్కార్ ఆమోదిస్తూ జీవో జారీ చేసింది. శ్రీధర్గౌడ్పై పీడీ యాక్ట్ అమలు చేయడాన్ని ఆయన భార్య ఎన్.శ్రీలత వేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు న్యాయమూర్తులు సంజరుకుమార్, షమీమ్ అక్తర్లతో కూడిన డివిజన్ బెంచ్ కొట్టివేస్తూ ఇటీవల తీర్పు చెప్పింది. తన భర్త ఆచూకీ తెలియడం లేదని, కోర్టులో హాజరుపర్చేలా ఆదేశాలు ఇవ్వాలని శ్రీలత హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. శ్రీధర్గౌడ్ను పీడీ యాక్ట్ కింద పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. హత్యలు, దందాలు, దోపిడీలు, కిడ్నాప్లు, భూదందాలు ఇలాంటి ఎన్నో ఆరాచకాలకు చట్ట వ్యతిరేక చర్యలకు శ్రీధర్గౌడ్ పాల్పడ్డాడని చెప్పారు. అంతే కాకుండా నయీం ఎన్కౌంటర్ తర్వాత కూడా ఆ చర్యలు కొనసాగిస్తూనే ఉన్నాడని, శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారని తెలిపారు. ప్రజల్ని భయాందోళనలకు గురిచేసే శ్రీధర్గౌడ్పై పీడీ యాక్ట్ ప్రయోగించడం సబబేనని చేసిన వాదనను హైకోర్టు సమర్ధించింది.