Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రపంచ తెలుగు మహాసభలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు శుక్రవారం శాసనసభలో ప్రకటన చేశారు. డిసెంబర్ 15 నుంచి 19 వరకూ ప్రపంచ తెలుగు మహాసభ నిర్వహించనున్నట్టు తెలిపారు. భాషా ప్రేమికులందరినీ మహాసభలకు ఆహ్వానిస్తామని కేసీఆర్ వెల్లడించారు. ఎమ్మెల్యేలతో పాటు అధికారులు, ప్రభుత్వ యంత్రాగమంతా మహాసభల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా భావించాలన్నారు. ఎల్బిస్టేడియం, రవీంద్రభారతి, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, తెలుగు విశ్వవిద్యాల యం ఆడిటోరియాల్లో జరుగుతా యన్నారు. సభల నిర్వహణకు రూ.50 కోట్లు నిధులు మంజూరు చేశామన్నారు. ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరుతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలుగువారు ఉన్న ఇతర రాష్ట్రాల్లోనూ సన్నాహాక సమావేశాలు చేపడతామన్నారు.
ధూప దీప నైవేద్యానికి సహకరించండి: మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
ధూప దీప నైవేద్య పథకాన్ని అమలులో సహకరిం చాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యేలకు ఆయన లేఖ రాశారు. నియమ నిబంధనల ప్రకారం డిసెంబర్ 8, 2017 తేదీ లోగా అర్చకులు ధూప దీప నైవేద్య పథకానికి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.