Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
ప్రభుత్వ పాఠశాలల క్రమబద్ధీకరణపై విద్యాశాఖ మళ్లీ కసరత్తు ప్రారంభించింది. పదిలోపు విద్యార్థులున్న సుమారు 1,210 పాఠశాలలను దగ్గరల్లోని బడుల్లో విలీనం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా వారం రోజుల్లో ఉపాధ్యాయ సంఘాలు, టీచర్స్ ఎమ్మెల్సీల తో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో వారందరి అభిప్రాయాలను సేకరించి, పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోనున్నారు.