Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
నాగార్జునసాగర్లో ఉన్న ప్రభుత్వ బీఈడీ కాలేజీని నల్లగొండ జిల్లా కేంద్రానికి తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండలోని డైట్కాలేజీ ప్రాంగణంలోనే బీఈడీ కాలేజీ కూడా కొనసాగనున్నది. నాగార్జునసాగర్ బీఈడీ కాలేజీ మారుమూల ప్రాంతంలో ఉండటంతో అక్కడ విధులు నిర్వహించేందుకు సిబ్బంది, లెక్చరర్స్ ముందుకు రావడం లేదు. దీంతో విద్యాశాఖాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు..