Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
తెలంగాణ అగ్నిమాపక శాఖకు ఎగ్జిబిషన్ సొసైటీ బకాయిలు చెల్లించడంతో కోర్టు ధిక్కార కేసును హైకోర్టు మూసివేసింది. గతంలో రూ.64.96 లక్షలను చెల్లించగా ఈ నెల 7వ తేదీన మిగిలిన బకాయి రూ.28.97 లక్షలను కూడా చెల్లించేసినట్టుగా హౌం శాఖ ప్రభుత్వ న్యాయవాది శ్రీకాంత్రెడ్డి హైకోర్టుకు శుక్రవారం తెలియజేశారు. దాంతో నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీపై కోర్టు ధిక్కార రిట్ను మూసివేసినట్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్, న్యాయమూర్తి షమీమ్ అక్తర్లతో కూడిన డివిజన్ బెంచ్ ప్రకటించింది. ఎగ్జిబిషన్ సొసైటీ అగ్నిమాపక శాఖకు బకాయిలు చెల్లించాలని న్యాయవాది అజాజుద్దీన్ రెండేండ్ల క్రితం రిట్ వేశారు. ఆరు నెలల్లో ఆ మొత్తాల్ని చెల్లించాలని హైకోర్టు ఆదేశాల్ని ఎగ్జిబిషన్సొసైటీ ఖాతరు చేయలేదు. దాంతో కోర్టు ధిక్కార రిట్ దాఖలైంది. బకాయిల చెల్లింపులతో కోర్టు ధిక్కార కేసును క్లోజ్ చేస్తున్నట్టు బెంచ్ ప్రకటించింది.
జగన్ అభ్యర్థనను తోసి పుచ్చిన కోర్టు
జగతి పబ్లికేషన్స్తోపాటే రాంకీ, హెటిరో, వాన్పిక్ కేసుల్ని కూడా కలిపి విచారణ చేయాలన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను నాంపల్లిలోని సీబీఐ కేసుల విచారణ ప్రత్యేక కోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. గతంలో ఇదే కోర్టు అన్ని కేసుల్ని కలిపి విచారించాలని నిర్ణయించిందని జగన్ తరఫు న్యాయవాది గుర్తు చేసినా కోర్టు అందుకు అంగీకరించలేదు. ఇదే అంశాన్ని పదేపదే చెబుతున్నారని, కోర్టు సమయాన్ని వ ధా చేస్తున్నారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. విచారణ ఈ నెల 24కి వాయిదా పడింది.