Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ,ప్రత్యేక ప్రతినిధి
బాలలపై జరుగుతున్న లైంగిక దాడులను నిరోధించడంలో సమాజంలోని ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని వక్తలు కోరారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బాలల సురక్షా యాప్ను ఎన్ఫోల్డ్ ప్రొయాక్టీవ్ కో ఫౌండర్ సంగీత సక్సేనా, ఫ్యాషన్ డిజైనర్ గణేష్ నల్లారి, సాక్షి ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్ దిలీప్రెెడ్డి, సైకియాట్రిస్ట్ డాక్టర్ పూర్నిమా నాగరాజు, విద్యావేత్త రంజీతరావు, ఉపాధ్యాయుడు ప్రాశంత్ తుప్పలు ఆవిష్కరించారు. రాష్ట్ర పోలీసు శాఖ,ఎన్ఫోల్డ్ ప్రోయాక్టీవ్ ట్రస్ట్, యూనిసెఫ్, కేంద్ర ఎలక్ట్రానిక్,టెక్నాలజీ శాఖ, సెంటర్ ఫర్ అడ్వాన్స్ ఇండియా విభాగాలు సంయుక్తంగా ఈ యాప్ను రూపొందించాయి.