Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని టీసాట్ స్టూడియోలో గ్రూప్-1 టాపర్లతో ముఖాముఖి కార్యక్రమం శనివారం జరగనుంది. ఈ మేరకు టీసాట్ సీఈవో ఆర్ శైలేష్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. శనివారం మధ్యాహ్నం మూడు నుంచి ఐదు గంటల వరకు ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. గ్రూప్-1 ఫలితాల్లో రెండో ర్యాంకు సాధించిన నూకల ఉదరురెడ్డి, ఏడో ర్యాంకు వచ్చిన డి విష్ణువర్ధన్రెడ్డి, పదో ర్యాంకర్ భారంతి వంశీకృష్ణలు వచ్చి వారి అనుభవాలను వివరిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంధానకర్తగా దీపికారెడ్డి వ్యవహరిస్తారని తెలిపారు. పోటీపరీక్షలు రాసే అభ్యర్థులు తమ సందేహాలను ర్యాంకర్లతో చర్చించేందుకు నేరుగా టీసాట్ టోల్ఫ్రీ నెంబర్ 1800-425-4038తోపాటు ఇతర నెంబర్లు 23540326, 23540726 సంప్రదించాలని సూచించారు.