Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిరిసిల్ల జిల్లా ఎస్పీ, డీిఎంహెచ్వొకు హైకోర్టు నోటీసులు
నవతెలంగాణ- హైదరాబాద్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ, జిల్లా వైద్యాధికారి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరిటెండెంట్లకు శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి ఎస్వీ భట్ నోటీసులు జారీ చేశారు.. కడమంచి వెంకటేష్పై పోలీసులు పెట్టిన కేసు, ఆ తర్వాత అ వ్యక్తి మతిపై నమోదు చేసిన అనుమానాస్పద కేసుల రికార్డుల్ని సీల్డ్ కవర్లో హైకోర్టుకు అందజేయాలని ఎస్పీని ఆదేశించారు. వెంకటేష్ మతికి సంబంధించిన వైద్య నివేదికలు అందజేయాలని జిల్లా వైద్యాధికారి, ప్రభుత్వాసుపత్రి సూపరింటెంటెంట్లను ఆదేశించారు. విచారణ 20వ తేదీకి వాయిదా పడింది. తన భర్తను కేసు విచారణ పేరుతో తీసుకుపోయి చిత్రహింసలకు గురిచేసి హతమార్చారని వెంకటేష్ భార్య రేణుక, పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ రిట్ దాఖలు చేశారు. వెంకటేష్ మతిపై స్వతంత్ర సంస్థ సీబీఐతో దర్యాప్తునకు ఆదేశించాలని, తన భర్త మతికి కారణమైన పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని హైకోర్టును కోరారు.