Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి జోగు రామన్న
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సంచార జాతుల వారి కోసం ప్రత్యేక గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో 5 గురుకుల పాఠశాలను ప్రారంభిస్తామన్నారు. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన వీరభద్రీయ కుల సంఘం రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వచ్చే సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా మరో 119 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తామన్నారు. బీసీల అభివృద్ధి కోసం ప్రత్యేక అభివృద్ధి నిధి ఏర్పాటు చేస్తామన్నారు.