Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆహ్వానం వస్తే ఆలోచిస్తా : మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
'కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డికి స్పష్టమైన హామీ లభించి ఉండవచ్చు. నాతో ఎవరు మాట్లాడకుండానే కాంగ్రెస్లో ఎలా చేరతా. హామీ ఇచ్చి ఉంటే రేవంత్తోనే ఫ్లైట్ ఎక్కేదాన్ని. టీఆర్ఎస్లో చేరాలని గతంలో ఆహ్వానించారు. మళ్లీ పిలిస్తే ఆలోచిస్తా.' అని మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత ఉమ మాధవరెడ్డి వ్యాఖ్యానించారు. ఆమె శుక్రవారం ఇక్కడ మీడియాతో చిట్చాట్ చేశారు. శుక్రవారం ఆమె సండ్ర వెంకటవీరయ్యతో కలిసి సీఎం కేసీఆర్ను కలిశారు. నక్సలైట్ల దాడిలో చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని వినతిపత్రం అందించారు.