Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డు ప్రమాదాల్లో 17 మంది మృతి
- కరీంనగర్ జిల్లాలో ఆటోను ఢకొీన్న పాల ట్యాంకర్
- ఆరుగురు పత్తి కూలీల దుర్మరణం
నవతెలంగాణ- విలేకరులు
రోడ్డు ప్రమాదాల్లో శుక్రవారం పలు జిల్లాల్లో 17 మంది ప్రాణం కోల్పోయారు. ఇందులో ఆరుగురు రోజువారీ కూలీ పని చేసుకుని బతుకీడ్చే పత్తి కూలీలే ఉన్నారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, మృతుల బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కరీంనగర్: కరీంనగర్ మండలం చామన్పల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు 16 మంది శుక్రవారం రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి సమీపంలో పత్తి ఏరేందుకు వెళ్లారు. ఆటో కొత్తపల్లి మండలం మల్కాపూర్ బైపాస్మీదుగా వెళ్తుండగా ఎస్ఆర్ఎస్పీ కాలువ మూలమలుపులో ఎదురుగా వచ్చిన పాలట్యాంకర్ ఢకొీంది. ఆటోను10 అడుగుల దూరంలోకి లాక్కెళ్లగా నుజ్జునుజ్జయింది. కూలీలకు తీవ్రగాయాలై చెల్లాచెదురుగా పడిపోయారు. ఆటోడ్రైవర్ ఒన్నం మాధవరావు(53), మేకల దేవమ్మ(55), మేకల సాయిలీల(19) అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు గాయపడిన వారిని '108', స్థానిక వాహనాల్లో కరీంనగర్ ఆస్పత్రులకు తరలించారు. మేకల లలిత(45), కూనరాజల ఓదమ్మ(50), నాంపెల్లి అంజలి(30) ఆస్పత్రిలో చనిపోయారు. మరో 12 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని చామన్పల్లి గ్రామస్తులు ధర్నా చేశారు.
బాధిత కుటుంబాలను ఆదుకుంటాం: ఎమ్మెల్యే గంగుల కమలాకర్
మృతుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా రూ.2 లక్షలు, డెయిరీవారు రూ.లక్ష, ఆపద్బంధు పథకం కింద రూ.50వేలు అందిస్తాం. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి 15 రోజుల్లో డబుల్బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తాం.
జగిత్యాల: వెల్గటూర్ మండలంలోని రాజక్కపల్లె వాగు బ్రిడ్జి వద్ద లారీ బైక్ను ఢకొీట్టింది. మొక్కట్రావ్పేటకు చెందిన బండి లక్ష్మణ్(35) అక్కడికక్కడే మృతిచెందాడు.
నిర్మల్: పంట ధాన్యాన్ని లోడు చేసుకొని ధర్మోర నుంచి నర్సాపూర్ వెళ్తుండగా నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలో లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మోహన్(43) అక్కడికక్కడే ప్రాణం కోల్పోయాడు.
నల్లగొండ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా ఖదిరి మండలం ఎరికళ్లవాండ్లపల్లికి చెందిన కిందే తులసన్న(63) కుటుంబం సర్కస్తో జీవనోపాధి పొందుతోంది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి గ్రామంలో ప్రదర్శన ఇచ్చేందుకు బొలెరోలో బయల్దేరారు. వారి వాహనం నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండల కేంద్రంలో అదుపు తప్పి డివైడర్ను ఢకొీట్టింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా తులసన్న మృతిచెందాడు.
యాదాద్రిభువనగిరి: వలిగొండ మండల కేంద్రానికి చెందిన ఎస్కె.సోహెల్(20) బైక్పై పులిగిల్లకు వెళ్లి వస్తుండగా, సుంకిశాల సమీపంలో టాటాఏసీ ఢకొీట్టడంతో తీవ్ర గాయాలై చనిపోయాడు. మోటకొండూరు మండలం మాటూరు గ్రామానికి చెందిన వట్టిపల్లి కాటంగౌడ్(50) తాటిచెట్లు ఎక్కి ఇంటికి వస్తుండగా కారు ఢకొీని అక్కడికక్కడే మృతిచెందాడు.
జోగులాంబ గద్వాల: ఉండవెల్లి మండలం అలంపూర్ క్రాస్ రోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢకొీని పాలమూరు వాసి వికాస్(22) మృతిచెందాడు.
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలానికి చెందిన అనిల్కుమార్(22), అమన్రాజ్(22), రతన్(22) స్నేహితులు. హైదరాబాద్లో ముగ్గురూ గురువారం అర్ధరాత్రి బైక్పై పోతుండగా సుచిత్ర సర్కిల్ వద్ద డివైడర్ను ఢకొీట్టారు. అనిల్కుమార్, రతన్ అక్కడికక్కడే మృతిచెందారు. అమన్రాజ్ రష్ ఆస్పత్రిలో చనిపోయాడు.
మరో ఘటనలో...
సికింద్రాబాద్ ఈస్ట్మారేడ్పల్లికి చెందిన అప్పని కొండల్(42), శ్రీకాంత్(35) స్నేహితులు. కొండల్ బుల్లెట్ బైక్ కొన్న సందర్భంగా స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నారు. తర్వాత శ్రీకాంత్, కొండల్ బైక్పై పోతూ శామీర్పేట మండలం, తూంకుంట దగ్గర డివైడర్ వద్ద సూచిక బోర్డు డ్రమ్కు ఢకొీట్టారు. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.