Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్
నవతెలంగాణ-హైదరాబాద్ బ్యూరో
సంక్షేమ పథకాల్లో జరుగుతున్న అవినీతిపై అధ్యయనం చేసేందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో 'టాస్క్ఫోర్స్' కమిటీ వేస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమారరెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ సర్కారు అమలు చేస్తు న్నామని చెబుతున్న సంక్షేమ పథకాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నదని పేర్కొన్నారు. సంగారెడ్డికి చెందిన పార్టీ నేత ఎస్ చంద్రశేఖర్ను టాస్క్ఫోర్స్ కమిటీకి చైర్మెన్గా నియమించారు. సభ్యులుగా మంచిర్యాలకు చెందిన బండి ప్రభాకర్ యాదవ్, నాగర్ కర్నూల్కు చెందిన మొర్రి గాలి యాదవ్, వనపర్తికి చెందిన రాజేంద్ర ప్రసాద్ యాదవ్, వరంగల్ కు చెందిన కె.శ్రీనివాస్ను నియమించారు.
50 రోజులు సభ జరపండి : కిషన్రెడ్డి
ప్రకటించిన విధంగా అసెంబ్లీని 50 రోజులు నిర్వహించాలని బీజేపీ శాసనసభ పక్షనేత కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. ప్రతి విషయంలోనూ మాట తప్పడం ముఖ్యమంత్రి కేసీఆర్కు అలవాటుగా మారిందన్నా శనివారం అసెంబ్లీలోని మీడియా హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని పొగిడేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తే.. ముఖ్యమంత్రి మాత్రం నిజాంను పొగిడారని ఎద్దేవా చేశారు.