Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఆలేరుటౌన్
పాలు నాణ్యతగా లేవని మదర్డెయిరీ యాజమాన్యం కొనుగోలు చేసేందుకు నిరాకరిం చడంతో పాడి రైతులు రాస్తారోకోకు దిగారు. కొన్నాళ్లుగా ఇబ్బందులు పడుతున్న రైతులు శనివారం యాదాద్రి జిల్లా ఆలేరు మండలం దిలావరపూర్లో పాలను రోడ్డుపై పారబోసి నిరసన తెలిపారు. రోజువారీ లాగానే పాడి రైతులు పాలు తీసుకొని ఆలేరులోని పాల శీతలీకరణ కేంద్రం వద్దకు వెళ్లారు. అయితే, పాలు నాణ్యతగా లేవని వాటిని కొనుగోలు చేసేందుకు నిరాకరించారు. దీంతో తమ వెంట తెచ్చిన పాలను రైతులు కిందపోసి రాస్తారోకోకు దిగారు. తమను అనవసరంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మదర్ డెయిరీ డీజీఎం అశోక్కుమార్ అక్కడికి చేరుకొని సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. కార్యక్ర మంలో రైతులు వెంకటేశ్, ఉప్పలయ్య, బాలరాజు, మహేందర్, రమేశ్, రాజు, అయిలయ్య పాల్గొన్నారు.