Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్టీ ప్రజా ప్రతినిధులతో సీఎం కేసీఆర్ భేటీ
- ఎస్టీ వ్యవసాయదారులందరికీ ఉచిత విద్యుత్
- విద్యుత్ కేసుల ఉపసంహరణ
- ప్రతి తండాకు త్రీఫేజ్ కరెంట్
- ఆహ్వానం లేని సున్నం రాజయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిజనుల విద్యుత్ బకాయిలు 70కోట్లను రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వెల్లడించారు. ఎస్టీలపై ఉన్న విద్యుత్ కేసులను ఉప సంహరించుకుం టున్నట్టు తెలిపారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టా ఉన్న వారితో ప్రతి గిరిజన వ్యవసాయదారుడికి ఉచిత విద్యుత్, సౌకర్యం, విద్యుత్ కనెక్షన్ కల్పిస్తామన్నారు. నివాస ప్రాంతాలకు రూ.125 ఫీజు తీసుకుని విద్యుత్ సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు.ఆదివాసీ ప్రాంతాల్లో రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసి స్థానికులకే అవకాశం కల్పిస్తామన్నారు. గిరిజనులకు కూడా గొర్రెల పెంపకం లాంటి స్వయం ఉపాధి పథకాలను వర్తింపచేస్తామని చెప్పారు. ఎస్టీ ప్రజాప్రతి నిధులతో సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్లో సమావేశం నిర్వహి ంచారు. ఈ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, జగదీశ్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, జెన్కో -ట్రాన్స్ కో సీఎండీ డి ప్రభాకర్రావు, డీజీపీ మహేందర్రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్ మీనా, ముఖ్య కార్యదర్శులు ఎస్ నర్సింగ్రావు, మహేశ్దత్ ఎక్కా, అటవీ శాఖ కార్యదర్శి రజత్ కుమార్, గిరిజన శాఖ కమిషనర్ లక్ష్మణ్తో పాటు గిరిజన టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ డొమెస్టిక్ కేటగిరిలో చాలా మంది గిరిజనుల విద్యుత్ బకాయిలున్నాయని వాటిన్ని రద్దు చేస్తున్నామన్నారు. రూ.70 కోట్లకు పైగా ఉన్న బకాయిల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.40 కోట్లు విద్యుత్ సంస్థలకు చెల్లిస్తుందని, మిగతా రూ.30 కోట్లు విద్యుత్ సంస్థ మాఫీ చేస్తుందన్నారు. ఎస్టీలపైన విజిలెన్స్ కేసులను ఎత్తివేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,737 గిరిజన ఆవాస ప్రాంతాలుండగా అందులో 8,734 గ్రామాల్లోనే త్రీఫేజ్ కరెంటు సరఫరా అవుతున్నదన్నారు. అటవీ ప్రాంతాల్లో విద్యుత్ లైన్ల నిర్మాణానికి అవసరమైన వ్యూహాన్ని రూపొందించాలని ఆటవీ శాఖ అధికారులకు సూచించారు. గిరిజన ఆవాస ప్రాంతాలన్నిటికీ రహదారి సౌకర్యం కల్పించాలని, దీనికోసం వచ్చే బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని చెప్పారు.
50 యూనిట్లు దాటితే చార్జీలు
ప్రతి గిరిజనుడి ఇంటికి ఉచితంగా సర్వీస్ వైర్, ఇంటిలోపల అవసరమయ్యే వైరింగ్, రెండు లైట్లు ఏర్పాటు చేస్తామని విద్యుత్ శాఖ సీఎండీ ప్రభాకర్రావు వెల్లడించారు. 50 యూనిట్లలోపు విద్యుత్ను వినియోగించే వారినుంచి ఎలాంటి చార్జీలు వసూలు చేయబో మని, అంతకు మించితే చార్జీలు వసూలు చేస్తామన్నారు.
ఎస్టీ ప్రజా ప్రతినిధులతో కమిటీలు
-ఎస్టీ ఆవాస ప్రాంతాలకు విధిగా రోడ్డు సౌకర్యం కల్పించే విషయంలో అధికారులతో సమన్వయం చేసుకోవడానికి ఎమ్మెల్యే రెడ్యానాయక్ నాయకత్వంలో ఒక కమిటీ, విద్య, స్వయం ఉపాధి విషయాల్లో సమన్వయానికి ఎంపీ సీతారాం నాయక్ నేతృత్వంలో కమిటీ
-విద్యుత్తుకు సంబంధించిన అంశాలపై అధికారులతో సమన్వయం చేసుకోవడానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నేతృత్వంలో కమిటీలను సీఎం ఏర్పాటు చేశారు.
ఆహ్వానం లేని సున్నం రాజయ్య
గిరిజన సమస్యలపై ఏర్పాటు చేసిన సమావేశానికి గిరిజనుడైన సీపీఐ(ఎం) ఎమ్మెల్యే సున్నం రాజయ్యను ప్రభుత్వం ఆహ్వానించకపోవడం చర్చానీయాంశమైంది. కేవలం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలను మాత్రమే ఆహ్వానించారు. గిరిజనుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకనే సున్నం రాజయ్యను ఆహ్వానించలేదన్న విమర్శలు వస్తున్నాయి.
ఉసూరు మనిపించిన సీఎం నిర్ణయం
ప్రజా ప్రతినిధులతో సమావేశం అంటే గిరిజనులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం మాకేదో చేయబోతుందనీ, మా జీవితాల్లో వెలుగు నింపుతారని ఎంతో ఆతృతతో ఎదురు చూశారు. కాని కేవలం రూ.70 కోట్ల విద్యుత్ బకాయిలను మాఫీ చేశామని చెప్పడంతో సర్కారు ఊరించి ఊసూరుమనిపించిందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు.