Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రస్తుత పరిస్థితుల్లో యువత వ్యవసాయ రంగంపై దృష్టిసారించాలని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి శోభనా కుమార్ పట్టానాయక్ అన్నారు. పీజీడీఎం అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు మూడో స్నాతకోత్సవం ఆదివారం రాజేంద్రనగర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టానాయక్ మాట్లాడుతూ 1996లో ఏర్పడిన ఈ మేనేజ్ కోర్సు యువతను వ్యవసాయం వైపు మళ్లించేందుకు కృషి చేస్తున్నదని అభినందించారు.