Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో వచ్చేనెల 22,23 తేదీల్లో సైన్స్, టెక్నికల్ ఎక్స్పో జరగనుంది. ఈ మేరకు గీతం ప్రో వైస్ చాన్సలర్ ఎన్ శివప్రసాద్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. గీతం హైదరాబాద్ ప్రాంగణంలో వైజ్ఞానిక ప్రదర్శన ఉంటుందని తెలిపారు. సమాజ సుస్థిరాభివృద్ధి, మానవాళి సౌకర్యం జీవించే నవకల్పనలు, సృజనాత్మకమైన ఆలోచనలకు ఇది వేదిక అవుతుందని పేర్కొన్నారు. ఒక్కో పాఠశాల గరిష్టంగా మూడు ప్రాజెక్టులను ప్రదర్శించొచ్చని తెలిపారు. ఆయా పాఠశాలల విద్యార్థులంతా ఈ ప్రదర్శనను ఉచితంగా తిలకించొచ్చని పేర్కొన్నారు. మూడు ఉత్తమ ప్రదర్శనలకు పదివేలు, ఐదు వేలు, మూడు వేల రూపాయల చొప్పున నగదు పురస్కారం అందిస్తామని తెలిపారు. ఈ ప్రదర్శనలో పాల్గొనే వారు సమన్వయకర్త విశ్వంను 9848092307 నెంబర్ను సంప్రదించాలని, scienceexpo@gitam.edu ఈమెయిల్కు వివరాలు పంపాలని కోరారు.