Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డిసెంబర్ 1న వికలాంగ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) రాష్ట్ర కార్యదర్శి ఎం.అడివయ్య తెలిపారు. సుందరయ్య కేంద్రంలో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సినిమాటోగ్రఫీ, పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్తోపాటు వికలాంగుల సంక్షేమశాఖ కార్యదర్శి జగదీశ్వర్, డైరెక్టర్ శైలజ, ఇతర ఉన్నతాధికారులు హాజరవుతారని పేర్కొన్నారు. ఎన్పీఆర్డీ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సమావేశం ఆదివారం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 3న ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్బంగా వికలాంగ కళాకారుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికితీయడానికి సాంస్కృతికి కార్యక్రమాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. వికలాంగుల పరికరాలపై జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎన్పీఆర్డీ రాష్ట్ర అధ్యక్షులు జీ.నర్సింహా, కోశాధికారి ఆర్.వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.