Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 5 నుంచిఆటోస్టార్టర్ల స్పెషల్డ్రైవ్
- జనవరి 1 నుంచి 24గంటల నిరంతర విద్యుత్ : జెన్కో సీఎమ్డీ డి ప్రభాకరరావు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
వ్యవసాయక్షేత్రాల్లో ఆటోస్టార్టర్లను రైతులు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని టీఎస్జెన్కో, ట్రాన్స్కో సీఎమ్డీ దేవులపల్లి ప్రభాకరరావు చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నందున భూగర్భజలాల పరిరక్షణ, అధిక విద్యుత్ వినియోగం అరికట్టేందుకు రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆటోస్టార్టర్ల తొలగింపుకై డిసెంబర్ 5వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో విద్యుత్ శాఖ సిబ్బంది స్పెషల్డ్రైవ్ నిర్వహిస్తారని తెలిపారు. దీనికి స్థానిక ప్రజాప్ర తినిధులు, అధికారులు సహకరించాలని కోరారు. దీనిపై విద్యుత్శాఖ అధికారులు గ్రామస్థాయిలో అవగాహనా కార్య క్రమాలు నిర్వహిస్తారని, 24 గంటల విద్యుత్ సరఫరా ప్రారంభం అయితే ఓవర్ లోడ్తో రైతుల మోటార్లు కాలిపోయే ప్రమాదం ఉన్నదని వివరించారు. ఈ మేరకు ఆదివారంనాడాయన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును కలిసి...ప్రయోగాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన 24 గంటల విద్యుత్ సరఫరా అంశాలను వివరించారు. తొలుత నవంబర్ 6 అర్ధరాత్రి నుంచి రాష్ట్రంలోని 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల విద్యుత్సరఫరాను ప్రయోగాత్మకంగా అమలు చేశామని, కేవలం ఐదారు రోజులే ఈ ప్రయోగం చేయాలని భావించినా, విద్యుత్వ్యవస్థ పటిష్టతను అంచనా వేయడం కోసం ఈనెల 20వ తేదీ వరకు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. 21వ తేదీ (మంగళవారం) నుంచి తిరిగి రైతులకు 9 గంటల సరఫరానే ఉంటుందని వివరించారు. జనవరి 1 నుంచి నిరంతరంగా 24 గంటల సరఫరాను పునరుద్ధరిస్తామన్నారు. ప్రయోగాత్మక సరఫరా వల్ల వ్యవస్థ సామర్ధ్యం, డిమాండ్, సరఫరాలను పక్కాగా అంచనా వేయగలిగామని, ఎక్కడా చెప్పుకోదగ్గ అవాంతరాలు ఏర్పడలేదని చెప్పారు.