Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో పోలీస్ హై అలర్ట్
- టీఎస్, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో నిరంతర సాయుధ బలగాల కూంబింగ్ ఆపరేషన్
- ఉత్తర తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాల్లో నిఘా పెంపు
నవ తెలంగాణ, ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర రాజధానిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతరు ఇవాంక పర్యటనను దృష్టిలో ఉంచుకుని ఉత్తర తెలంగాణాలోని నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో పోలీసులు అంతర్గతంగా హై అలర్ట్ను ప్రకటించారని తెలిసింది. మాదాపూర్లోని హెచ్ఐ సీసీలో జరుగుతున్న గ్లోబల్ ఎంట్రప్రెన్యూవర్ సద స్సులో ఇవాంకతో పాటు 150దేశాల వ్యాపారవేత్తలు పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరా బాద్ నగరంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేసిన పోలీసు ఉన్నతాధికారులు మరోవైపు రాష్ట్రంలో మావోయిస్టుల నుంచి ఎలాంటి చిన్న అలికిడి కూడా చోటు చేసుకోరాదనే లక్ష్యంతో ఉన్నారని సమాచా రం. ముఖ్యంగా ఇటీవల ఉత్తర తెలంగాణాలోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో మావోయిస్టులు పోస్ట ర్లు వేయడం వెలుగుచూసింది. మరోవైపు భూపాల పల్లి జిల్లాలో మావోయిస్టులకు అండగా ఉంటారనే అనుమానాలు ఉన్న గొత్తికోయలు అటవీ ప్రాంతంలో ఏర్పరచుకున్న నివాసాలను బలవంతంగా తొలగించి వారిని తరిమివేయడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టుల కద లికలపై అప్రమత్తమైన పోలీసు అధికారులు ఇవాంక పర్యటన సందర్భంగా మావోయిస్టుల నుంచి ఏదేని విధ్వంసకర చర్య చోటు చేసుకునే ప్రమాదాన్ని అను మానిస్తున్నట్టు తెలిసింది. అమెరికా సామ్రాజ్యవాది అని పరిగణించే మావోయిస్టులు ఇక్కడ ఇవాంక పర్యటనను వ్యతిరేకిస్తూ నిరసన రూపంలో ఏదేని అవాంఛనీయ ఘటనలకు పాల్పడే అవకాశాలను తోసిపుచ్చడం లేదు. ఈ పరిస్థితిలో ఉత్తర తెలంగా ణాలోని కొన్ని నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో పోలీసు నిఘాను పెంచారు. అలాగే ఉత్తర తెలంగాణాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో నిరంతర నిఘాను కొనసాగిం చాలని ఇంటెలిజెన్స్ విభాగానికి ఆదేశాలు ఉన్నట్టు తెలిసింది. ఇక రాష్ట్ర సరిహద్దులోని ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని సాయుధ పోలీసు బలగాలతో పాటు గ్రేహౌండ్స్ దళాలు కూంబింగ్ ఆపరేషన్ను ముమ్మరం చేసినట్టు తెలిసింది.
ఈ చర్యలను ఇవాంక రాష్ట్ర్ట్ర పర్యటన ముగిసేంతవరకు కొనసాగించాలని కూడా బలగాల కు ఆదేశాలు ఉన్నట్టు తెలిసింది. మొత్తంమీద రాజధానిలో జరుగుతున్న ఈ సదస్సును కవర్ చేయడానికి అంతర్జాతీయ మీడియా కూడా తరలి వస్తున్నది. ఈ తరుణంలో మావోయిస్టుల నుంచి ఏ చిన్న ఘటన చోటు చేసుకున్నా అది పెద్ద ఘటనగా మీడియా ఫోకస్ చేసే అవకాశం ఉందని పోలీసు ఉన్నతాధికారులు ఈ ముందస్తు జాగ్రత్తలను తీసుకుంటున్నట్టు తెలిసింది.