Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీమాస్ ఫోరం స్టీరింగ్ కమిటీ నాయకులు వినయకుమార్
- మహబూబ్నగర్లో కవులు, రచయితల సమావేశం
నవతెలంగాణ-మహబూబ్నగర్
ప్రభుత్వ విధానాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కవులు, రచయితలు తమ రచనలతో పేదలను చైతన్యం చేయాలని టీమాస్ ఫోరం స్టీరింగ్ కమిటీ నాయకులు వినయకుమార్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. మహబూబ్నగర్లోని లిటిల్ స్కాలర్స్ పాఠశాలలో కవులు, రచయితల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాబోయే రోజుల్లో మహబూబ్నగర్ జిల్లా నుంచి సామాజిక అంశాలపై రచనలు చేసే విధంగా రచయితలు, కవులు కృషి చేయాలని కోరారు. అనంతరం టీమాస్ ఫోరానికి అనుబంధంగా కవులు, రచయితల సాహితీ వేదిక ఏర్పాటు చేశారు. కమిటీ చైర్మెన్గా చరణ్, కన్వీనర్గా పరిమళ్, కో-కన్వీనర్గా పుష్పలత, సభ్యులుగా భాస్కరయ్య, జమున, బోలే యాదయ్య, కెఎల్.సత్యం, సలహాదారులుగా జలజం సత్యనారాయణ, వల్లభాపురం జనార్ధన్లను నియమించారు. ఈ సమావేశంలో మేధావుల ఫోరం జిల్లా కన్వీనర్ కురుమూర్తి, టీమాస్ ఫోరం స్టీరింగ్ కమిటీ మెంబర్ వీరాంజనేయులు, ఎ.రాములు, నర్మద పాల్గొన్నారు.