Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20 వామపక్ష పార్టీల ఐక్యసంఘటనే ప్రత్యామ్నాయం :సీపీఐ(ఎం)లో చేరిన మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సింహ
నవతెలవంగాణ-ఇబ్రహీంపట్నం
'రాష్ట్రంలో ప్రభుత్వాలు మారడం కాదు..పాలించే పద్ధతిలో మార్పురావాల్సిన అవసరం ఉంది' అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. అందుకు టీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం కాదని, 20 వామపక్ష పార్టీలతో ఏర్పడనున్న ఐక్యసంఘటనే ప్రత్యామ్నాయమని ఆయన మరోమారు నొక్కి చెప్పారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని వైష్ణవి గార్డెన్లో ఆదివారం మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సింహతో పాటూ, మరో 150 మంది సీపీఐ నుంచి సీపీఐ(ఎం)లో చేరారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడారు. ఆర్థిక విధానాల్లో మార్పులు రావాలని, సామాజిక న్యాయం అమలు జరగాలని ఆకాంక్షించారు. అట్టడుగు కులాలపై పెత్తందారుల ఆగడాలు పెరుగుతూనే ఉన్నాయని చెబుతూ..యాద్రాద్రి జిల్లా పల్లెర్లలో జరిగిన కుల దురంహకార హత్యలను గుర్తుచేశారు. ఆ ఘటనపై టీమాస్, సీపీఐ(ఎం) మినహా మరే పార్టీ కూడా స్పందించలేదన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నంలో సీపీఐ(ఎం) గెలుపునకు కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి భూపాల్, జిల్లా కమిటీ సభ్యులు బి.సామెల్, మధుసూదన్రెడ్డి, యాదయ్య, కె.జగన్, నర్సింహ, జగదీశ్, జంగయ్యలు పాల్గొన్నారు.