Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరంలో ఉన్నత విద్యలో చేరేందుకు నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్షలు (సెట్స్)-2018 నిర్వహణపై ఉన్నత విద్యామండలి దృష్టి సారించింది. తేదీల ఖరారు, పరీక్షల నిర్వహణ వంటి అంశాలపై కసరత్తు ప్రారంభించింది. ప్రవేశ పరీక్షలన్నింటినీ ఆన్లైన్లోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా ఎలాంటి పద్ధతులు అనుసరించాలి, విధివిధానాల రూపకల్పనపై ఈనెల 27న ఉన్నత స్థాయి కమిటీ సమావేశం ఉన్నత విద్యామండలిలో జరగనుంది.