Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ, ప్రత్యేక ప్రతినిధి
లంచం తీసుకుంటూ సంగారెడ్డి జిల్లా నాగ్పూర్ గ్రామ వీఆర్ఓ వెంకటేశ్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు గురువారం పట్టుబడ్డాడు. ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు తెలిపిన వివరాల ప్రకారం నాగ్పూర్ గ్రామానికి చెందిన ఒక మహిళ తన పేరును తన వారసుల పేర్లతో జత చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకుంది. దాంతో రెండు వేలు ఇస్తేనే చేస్తానని వీఆర్వో స్పష్టం చేశాడు. ఆ మేరకు బాధితురాలు సంగారెడ్డి బస్స్టాప్ వద్ద డబ్బులు ఇస్తుండగా కాపు కాసిన ఏసీబీ అధికారులు నిందితుడు వెంకటేశ్ను రెడ్ హాండెడ్గా పట్టుకున్నారు. లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు.