Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీమాస్ నాయకులు ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై మతోన్మాదుల దాడిని కుల వివక్ష పోరాట సంఘం (కేవీపీఎస్) ఖండించింది. ఈ మేరకు కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కె భాస్కర్, కార్యదర్శి టి స్కైలాబ్బాబు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. కోర్టు కేసు కోసం జగిత్యాల జిల్లా కోరుట్లకు వెళ్లిన కంచ ఐలయ్యపై రాళ్లు రువ్వి భౌతిక దాడికి పాల్పడిన ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, మతోన్మాద అరాచక శక్తులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఐలయ్య కోర్టుకు హాజరయ్యే విషయం పోలీసులకు ముందే తెలిసినా దాడి జరగడం శోచనీయమని తెలిపారు.