Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్్:ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ టీచర్స్ ఆర్గనై జేషన్స్ (ఏఐఎఫ్టీఓ) డిప్యూటీ సెక్రెటరీగా తెలంగాణకు చెంది న మారెడ్డి అంజిరెడ్డి ఎన్నిక య్యారు. గురువారం సిమ్లాలో జరిగిన జాతీయకార్గవర్గ సమా వేశంలో ఆ సంఘం సెక్రటరీ జనరల్ సీఎల్ రోజ్ ఎంపిక విషయాన్ని అధికారికంగా ప్రక టించారు. అంజిరెడ్డి ప్రస్తుతం పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగు తున్నారు. ఆయన ఎన్నిక పట్ల పీఆర్టీయూటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం చెన్నయ్య హర్షం వ్యక్తం చేశారు. కాగా తెలంగాణ పదో తరగతి పరీక్షల్లో సిట్టింగ్ స్క్వాడ్స్గా రెవె న్యూ అధికా రులను నియమించవద్దని ఆయన ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
28,29న డీఈఓల సమావేశం
ఈనెల 24,25 తేదీల్లో హైదరాబాద్లో జరగా ల్సిన డీఈఓల సమావేశం వా యిదా పడింది. తిరిగి 28,29 తేదీల్లో నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖాధికారులు తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలు ఎక్కువగా ఉన్నాయి.