Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీజీపీ మహేందర్రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
చదువుకోవాలి సందేశాత్మక చిత్రమని డీజీపీ మహేందర్రెడ్డి చెప్పారు. బాలల చలనచిత్రోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. అందులో భాగంగానే హైదరాబాద్ రవీంద్రభారతిలో డీజీపీ మహేందర్రెడ్డి ప్రత్యేకంగా తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సామాజిక స్పృహతో చదువుకు ఉన్న ప్రాధాన్యతను వివరిస్తూ సినిమా నిర్మించిన దర్శకుడు ఎం వెంకటేశ్వరరావును ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి సందేశాత్మక చిత్రాల వల్ల నేటి సమాజంలో గుణాత్మక మార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అక్షరాస్యత పెంచేందుకు ఇలాంటి చిత్రాలు దోహదప డతాయని ఇంధన శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి అజరుమిశ్రా అన్నారు. విద్యపై సమాజంలో చైతన్యం పెంచడం కోసమే ఈ చిత్రాన్ని నిర్మించానని వెంకటేశ్వరరావు చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మెన్ పాపిరెడ్డి, వైస్ చైర్మెన్లు లింబాద్రి, వెంకటరమణ, ఐఏఎస్ అధికారులు జగన్మోహన్, జగదీశ్వర్, హరినాథశర్మ, సాంస్కృతిక శాఖ కార్యదర్శి మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.