Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మ్యుజికల్ నైట్స్ పేరుతో మద్యం సరసరా చేయాలని నిర్ణయించిన సన్బర్స్ కార్యక్రమాన్ని నిలిపివేయాలని యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మ్యూజికల్ నైట్స్ అంటూ 15 ఏండ్ల లోపు పిల్లలకు అనుమతి ఇస్తామని ఎందుకు చెబుతుందని ప్రశ్నించింది. సన్బర్న్ కార్యక్రమాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు అనిల్కుమార్ యాదవ్ నేతృత్వంలో వందలాది మంది యువకులు ఎక్సైజ్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ మ్యుజికల్ నైట్స్కు యూత్ కాంగ్రెస్ వ్యతిరేకం కాదన్నారు. ఆ ముసుగులో మద్యం అమ్మకాలు,డ్రగ్స్ సరఫరా చేస్తామంటే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఒకవైపు మ్యుజికల్ నైట్ అని చెబుతూ... మరొవైపు 15 ఏండ్ల లోపు పిల్లలకు అనుమతి ఇస్తామని చెప్పడం వెనుక అంతర్యమేమిటని ప్రశ్నించారు. ఈ సంస్థ కార్యక్రమాలను గోవా, కర్నాటక, ఢిల్లీ రాష్ట్రాలు నిషేధిం చాయన్నారు. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం సిగ్గు చేటన్నారు. యూత్ కాంగ్రెస్ కార్యదర్శి వెంకట్ గురజాల, రాష్ట్ర నాయకులు కోటం అనిల్కుమార్, మెట్టు సాయి కుమార్, అమ్ముల మధుకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.