Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
తెలంగాణ డైరెక్టర్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ పరిధిలోని ఈఎస్ఐ వైద్యశాలలు, ఈఎస్ఐ డిస్పెన్సరీలను మరియు ఈఎస్ఐ డైగ్నోస్టిక్స్ సెంటర్స్ను ఈఎస్ఐ సొసైటీ పరిధిలోకి మార్చాలనే కేంద్ర ప్రభుత్వం చర్యలను తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఖండించింది. ఈమేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ విఠల్, ఎన్ నారాయణరెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్రం తీసుకున్న ఈనిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.