Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చదువుతోనే సమాజంలో గుర్తింపు : డాక్టర్ ఆర్ఎస్. ప్రవీణ్కుమార్
నవతెలంగాణ - రాంనగర్
చదువుతోనే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని తెలంగాణ ఎస్సీ, గురుకుల విద్యాలయాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ప్రవీణ్కుమార్ అన్నారు. అంబేద్కర్ లేకుంటే నేను లేనని, నేను మీ ముందు నిలబడ్డానంటే అది అంబేద్కర్ స్ఫూర్తి అని అన్నారు. అన్నం మెతుకుల కంటే అక్షరం విలువైనదని, అన్నం లేకున్నా అక్షరాలు తిని బతకాలనే ఆలోచన స్వేరోస్ లక్ష్యం కావాలని, అదే సంకల్పంతో ముందుకుపో వాలని ఆకాంక్షించారు. హైదరాబాద్లోని బాగ్లింగం పల్లిలో గల సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఇండస్ బుక్ ట్రస్టు, స్వెరోస్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ప్రవీణ్కుమార్ 50 జన్మదినాన్ని గురువారం జరిపారు. ప్రవీణ్కుమార్పై చిర్రా రాజేష్కన్నా గౌడ్, అరూరి సుధాకర్ రచించిన 'జ్ఞానయోద' పుస్తకాన్ని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు ఆవిష్కరించారు. అనంతరం ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులు సూచించారు. తిండి తినకున్నా..గొప్పగా చదివి నా పిల్లలు ఆకాశం అంచుల్లో ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటు న్నారని, ఈ పుస్తకం వారికి అంకితం చేస్తున్నానని తెలిపారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన కాకి మాధవరావు మాట్లాడుతూ జ్ఞానమే అన్ని సమస్యలకు పరిష్కారమని నమ్మిన మేధావి ఆర్.ఎస్ ప్రవీణ్కు మార్ అన్నారు. జ్ఞాన సమాజాన్ని నిర్మించేందుకు అతను రాజ్యాంగబద్ధమైన వ్యవస్థను ఉపయోగిస్తు న్నాడన్నారు. అరూరి సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పుస్తక స్వీకర్త ప్రవీణ్కుమార్ తల్లి ప్రేమమ్మ, రిటైర్డ్ ఐఆర్టీఎస్ అధికారి అప్పికట్ల భరత్భూషణ్, మల్లయ్య భట్టు, జి.లక్ష్మయ్య, డాక్టర్ అంబటి సురేంద్రరాజు, నలిగంటి శరత్, రవి, శ్రీనివాస్ పాల్గొని ప్రసంగించారు.