Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వికలాంగుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని, ప్రతిభను లోకానికి చాటి చెప్పేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వికలాంగుల కళాకారులతో సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించనున్నట్టు వికలాంగుల హక్కులు జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) ప్రకటించింది. డిసెంబర్ 3న ప్రపంచం వికలాంగుల దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 1న ఒంటిగంటకు తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు పేర్కొంది. గురువారం సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఎస్వీకేలో సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గోరెంకల నర్సింహ్మ, ఎం అడివయ్య, కోశాధికారి ఆర్ వెంకటేష్, ఉపాధ్యక్షులు ఎండి యూసుఫ్, నాయకురాలు గంగమ్మ తదితరులు 'వికలాంగుల సాంస్కృతిక ఉత్సవాల పోస్టర్'ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, స్త్రీ, శిశు, వికలంగుల సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి ఎం జగదీశ్వర్, వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ బి శైలజ, వికలాంగుల కార్పొరేషన్ చైర్మెన్ కేతిరెడ్డి వాసుదేవరరెడ్డి, సినీ నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ అనీల్ రావిపూడి వంటి ప్రముఖులు పాల్గొంటారని వారు పేర్కొన్నారు.