Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కె.భాస్కర్, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆశాలత
నవతెలంగాణ-నవీపేట్
దళితులపై వరుసగా జరుగుతున్న దాడులకు కేంద్ర, రాష్ట్ర పాలకులే బాధ్యత వహించాలని కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు కె.భాస్కర్, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆశాలత అన్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని అభంగపట్నంలో భరత్రెడ్డి చేతిలో దౌర్జన్యానికి గురైన రాజేశ్వర్, లక్ష్మణ్ కుటుంబ సభ్యులను గురువారం వారు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో దళితులపై దాడులు పెద్దఎత్తున పెరిగాయని, టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత వ్యతిరేక చర్యలతో ముందుకు వెళ్తోందని అన్నారు. బాధితులను భరత్రెడ్డి కిడ్నాప్ చేసి 15 రోజులు కావొస్తున్నా పోలీసులు వారి ఆచూకీ తెలుసు కోలేకపోయారన్నారు. తన నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటనపై ఎంపీ కవిత కనీసం స్పందించకపోవటం దారుణమన్నారు. దేశవ్యాప్తంగా దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఐక్యంగా ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. పోలీసులు స్పందించి భరత్రెడ్డిని అరెస్టుచేసి బాధితులను కుటుంబ సభ్యులకు అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలను ఉధృతంచేస్తామని హెచ్చరించారు. వారివెంట ఐద్వా జిల్లా కార్యదర్శి సబ్బనిలత, నాయక్వాడి శ్రీనివాస్ పాల్గొన్నారు.