Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయోగాత్మకంగా 10 రూట్లలో 50 బస్సులు: మంత్రి మహేందర్రెడ్డి వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మెట్రో రైలుకు ఆర్టీసీ బస్సులను అనుసంధానంగా నడిపిస్తామని రవాణాశాఖ మంత్రి మహేందర్రెడ్డి తెలిపారు. మెట్రోరైలు ప్రారంభమవుతు న్నందున ఆర్టీసీకి నష్టం కలుగుతుందంటూ కథనాలు వస్తున్న సందర్భంలో మంతి మహేందర్రెడ్డి అధికారులతో కలిసి గురువారం విలేకరులతో మాట్లా డారు. మెట్రోరైలు ప్రారంభమైతే ఆర్టీసీకి ఎలాంటి నష్టమూ వాటిల్లదని, ఇది రాష్ట్రానికి మణిహారంగా నిలుస్తుందని మంత్రి తెలిపారు. మెట్రో రైలు దేశంలోనే అధునాతనమైనదని తెలిపారు. మియాపూర్ - నాగోల్ మధ్య వయా సికిం ద్రాబాద్, అమీర్పేట మీదుగా 30 కిలోమీటర్ల దూరంలోని 10 రూట్లలో 50 బస్సులు ప్రయోగాత్మకంగా మెట్రోకు అనుసందానంగా నడిపిస్తామని చెప్పారు. గీతం యూనివర్సిటీ విద్యార్థుల నివేదిక ఆధారంగా ఈ రూట్లలో బస్సులు నడిపిం చాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. మెట్రోరైల్ 24 రైల్వే స్టేషన్లకు ఇరు వైపులా 22 కాలనీలకు ప్రతి 10 నిమిషాలకో బస్సు చొప్పున 212 ట్రిప్పులు నడిపి ంచాలని అనుకుంటున్నామని చెప్పారు. అయితే మెట్రోతో కలిపి టికెట్లు ఇచ్చే ఆలోచన లేదన్నారు. కాలుష్య నివారణ కోసం కొత్త బస్సులను వినియోగిస్తామని, ఇందులో భాగంగా 120 బస్సులను కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ఎలక్ట్రిక్ బస్సులను కూడా ఉపయోగించుకుంటామని చెప్పారు. ముంబాయి, బెంగుళూరు తరహాలో రవాణా సేవలు అందించడంతో పాటు పార్కింగ్లు ,బస్బేల కోసం ఏర్పాటు చేస్తామన్నారు. వీటికి జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తుందన్నారు.
పారిశ్రామిక వేత్తల సదస్సుకు బస్సులు
ఈనెల 28న రాజధానిలో ప్రధాని నరేంద్రమోడీ, ఇవాంక ట్రంప్ పర్యటన నేపథ్యంలో ప్రత్యేకంగా 50 ఏసీ బస్సులు నడుపుతామని మంత్రి తెలిపారు. 150 దేశాలకు చెందిన సుమారు 1200 మంది ప్రతినిధులు, 300 మంది వాణిజ్య వేత్తలు, 50 మంది ప్రముఖులు హాజరవుతున్నారని వీరి కోసం 60 ఏసీ మల్టీ యాక్సిస్ ఓల్వో బస్సులను అందుబాటులో ఉంచామన్నారు. తెలంగాణ టూరిజం మరో 10 బస్సులను ఏర్పాటు చేస్తుందని తెలిపారు.
అతిధులు మెచ్చేలా ఔటర్ : ప్రియాంక వర్గీస్
హైదరాబాద్ : పారిశ్రామిక వేత్తల సదస్సుకు అనేక దేశాల ప్రతినిధులు వస్తున్నందున, వారందరూ మెచ్చేలా ఔటర్ను తీర్చిదిద్దాలని సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ తెలిపారు. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్డు పచ్చదనంపై ఉన్నతాధికారుల సమీక్ష జరిగింది.
ఈ సందర్భంగా క్షేత్రస్థాయి పర్యటన జరిపారు. కండ్లకోయ జంక్షన్ నుంచి పటాన్ చెరువు, ఫైనాన్షియల్ జిల్లా, శంషాబాద్, ఆదిభట్ల, పెద్ద అంబర్పేట, కీసర, షామీర్ పేటల మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం 158 కిలోమీటర్ల పొడుగునా పచ్చదనం ఉండాలని ప్రియాంక వర్గీస్ తెలిపారు. ఔటర్ ప్రయాణం పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉండాలనేది సీఎం కేసీఆర్ ఆశయమన్నారు. చనిపోయిన మొక్కల స్థానంలో పెద్ద మొక్కలు వెంటనే నాటాలన్నారు.